
తెలంగాణలో డ్రోన్ ఫొటోగ్రఫీ నిషేధం
తెలంగాణలో డ్రోన్ ఫొటోగ్రఫీని నిషేధించారు. సైబరాబాద్ పోలీసులు ఈ మేరకు నిషేదాజ్ఞలు జారీ చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో డ్రోన్ ఫొటోగ్రఫీని నిషేధించారు. సైబరాబాద్ పోలీసులు ఈ మేరకు నిషేదాజ్ఞలు జారీ చేశారు. ఇలాంటి డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందని ముంబయి పోలీసులు హెచ్చరిస్తూ వారి రాష్ట్రంలో డ్రోన్ ఫొటోగ్రఫీపై నిషేధం విధించిన నెల రోజుల్లోనే తెలంగాణలో కూడా ఈ తరహా పొటోగ్రఫీపై నిషేధం విధించారు.
సాధారణంగా బహిరంగ సమావేశాల్లో, ముఖ్యమైన ఉత్సవాల్లో, ప్రముఖ కార్యక్రమాల్లో ఈ మధ్య డ్రోన్లతో ఫొటోలు తీసే సంప్రదాయం ఎక్కువతుంది. అయితే, ఉగ్రవాదులు ఇలాంటి డ్రోన్లను ఉపయోగించుకుని దాడులకు తెగబడే ప్రమాదం ఉందన హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో రిమోట్ సహాయంతో నడిచే డ్రోన్లు, తేలికగా ఎగిరే విమానాలు ప్రస్తుతానికి నిషేధిస్తున్నామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ తెలిపారు. అత్యవసరం అనుకుంటే ముందస్తుగా లిఖిత పూర్వక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.