నేడు కాంట్రాక్ట్‌ అధ్యాపకుల రాస్తారోకో | contract lecturers rastha roko today | Sakshi
Sakshi News home page

నేడు కాంట్రాక్ట్‌ అధ్యాపకుల రాస్తారోకో

Dec 11 2016 11:59 PM | Updated on Jun 1 2018 8:36 PM

కాంట్రాక్ట్‌ అధ్యాపకుల ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని ఆ సంఘం జేఏసీ నాయకులు పిలుపు నిచ్చారు. ఆదివారం కూడా వారు ఆందోâýæనను కొనసాగించారు. వారు మాట్లాడుతూ న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని వారం రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించు కోవడంలేదన్నారు.

అనంతపురం రూరల్‌:     కాంట్రాక్ట్‌ అధ్యాపకుల ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని  ఆ సంఘం జేఏసీ నాయకులు పిలుపు నిచ్చారు. ఆదివారం కూడా వారు ఆందోâýæనను   కొనసాగించారు. వారు మాట్లాడుతూ న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని వారం రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించు కోవడంలేదన్నారు.

సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయని ఈ ప్రభుత్వానికి న్యాయస్థానాలంటే ఎంత గౌరవం ఉందో స్పష్టం అవుతోందన్నారు.  నేడు   రాస్తారోకో చేపడుతున్నట్లు తెలిపారు. అధ్యాపకుల సమ్మెకు ఎమ్మెల్సీ గేయానంద్‌ మద్దతు ప్రకటించి మాట్లాడారు. కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం నాయకులు హనుంతరెడ్డి, ఎర్రప్ప, సుబ్రహ్మణ్యం, అక్బర్, ఎంజీ ప్రభాకర్, రామాంజనేయులతోపాటు పలువురు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement