–గూళ్యపాళ్యంలో మళ్లీ కలకలం
వజ్రకరూరు : మండలంలోని గూళ్యపాళ్యంలో చిరుత మళ్లీ కలకలం సష్టించింది. ఆదివారం ఉదయం గ్రామసమీపంలోని కొండపై నుంచి కిందకు వచ్చింది. కొద్దిసేపు పరిసరాల్లో తిరిగింది. అక్కడున్న కుక్కపై దాడికి యత్నించగా.. అది తప్పించుకుంది. ఆ తర్వాత మళ్లీ కొండపైకి వెళ్లి..కొద్దిసేపు ఒకేచోట ఉంది. చిరుత మరోమారు కనిపించడంతో గ్రామస్తులు హడలిపోయారు. మిద్దెలపైకెక్కి దాన్ని చూశారు. గ్రామస్తులకు చిరుత కన్పించడం నెల రోజుల వ్యవధిలో ఇది నాల్గోసారి. దీంతో రాత్రి సమయాల్లో ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. కొండ సమీపంలో నివసిస్తున్న కుటుంబాలు మరింత ఆందోళనకు గురవుతున్నాయి. పంట పొలాలకు వెళ్లడానికి రైతులు కూడా జంకుతున్నారు.
ఈ నెల ఎనిమిదిన కురుబ కొమ్మె కేశప్ప అనేlరైతుకు చెందిన ఆవుదూడను గ్రామ సమీపంలోని ఊరుకుంట వద్ద చంపేసింది. అలాగే తొమ్మిదోతేదీ లాలుస్వామి ఆలయానికి చెందిన గుర్రంపైనా దాడి చేసి గాయపరిచింది. చిరుత విషయమై ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి గతంలోనే జిల్లా అధికారులతో మాట్లాడారు. వారి సూచన మేరకు అటవీ శాఖ అధికారులు, రెస్క్యూటీం, పోలీసులు గ్రామంలో ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం వజ్రకరూరు ఎస్ఐ జనార్దన్ నాయుడు, ఏఎస్ఐ కుళ్లాయిస్వామి కూడా గ్రామంలో పర్యటించి.. ప్రజలను అప్రమత్తం చేశారు. కొండ పరిసరాల్లో బోన్లు ఏర్పాటు చేసి..చిరుతను బంధిస్తే సమస్య తీరుతుందని స్థానికులు అంటున్నారు.
అదిగదిగో చిరుత
Published Sun, Oct 16 2016 10:38 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement