చెరువుకు గండి.. కొట్టుకుపోయిన పశువులు | cattles missing due to floods in racharla timmapur village | Sakshi
Sakshi News home page

చెరువుకు గండి.. కొట్టుకుపోయిన పశువులు

Published Sun, Sep 25 2016 9:15 AM | Last Updated on Wed, Aug 1 2018 4:01 PM

కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్ గ్రామ చెరువుకు గండిపడింది

ఎల్లారెడ్డిపేట(కరీంనగర్): కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్ గ్రామ చెరువుకు గండిపడింది. గ్రామస్థులంతా నిద్రిస్తున్న సమయంలో శనివారం అర్ధరాత్రి చెరువుకు గండిపడటంతో.. దిగువకు దూసుకొచ్చిన నీరు కొద్దిసేపట్లోనే గ్రామాన్ని ముంచెత్తింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను రక్షించారు. వదర ఉధృతికి సుమారు 100 పశువులు కొట్టుకుపోయి ఉండవచ్చని స్థానికులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement