జమ్మికుంట : పట్టణంలోని వంతెనకు ఇరువైపులా ఉన్న దుకాణాదారులు వెంటనే అక్రమ కట్టడాలు తొలగించి సెట్బ్యాక్ చేసుకోవాలని నగర పంచాయతీ చైర్మన్ పోడేటి రామస్వామి వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ శ్రీకాంత్తో కలిసి ఆయన రైల్వేఫ్లైఓవర్కు ఇరువైపులా ఉన్న దుకాణాలను గురువారం పరిశీలించారు.
వారంలోగా అక్రమ కట్టడాలు తొలగించాలి
Jul 21 2016 11:16 PM | Updated on Sep 4 2017 5:41 AM
జమ్మికుంట : పట్టణంలోని వంతెనకు ఇరువైపులా ఉన్న దుకాణాదారులు వెంటనే అక్రమ కట్టడాలు తొలగించి సెట్బ్యాక్ చేసుకోవాలని నగర పంచాయతీ చైర్మన్ పోడేటి రామస్వామి వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ శ్రీకాంత్తో కలిసి ఆయన రైల్వేఫ్లైఓవర్కు ఇరువైపులా ఉన్న దుకాణాలను గురువారం పరిశీలించారు. గతంలో హామీ ఇచ్చిన ప్రకారం వంద అడుగులకు ఇరువైపులా సెట్బ్యాక్ చేసుకోవాలని వ్యాపారులకు సూచించారు. తాగునీటి పైపులైన్ నిర్మాణం, పట్టణ అభివృద్ధి కోసం సహకరించాలని కోరారు. నడిరోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభాలు తొలగించాలని వ్యాపారులు కోరగా.. చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. కమిషనర్ మాట్లాడుతూ వ్యాపారులు వారంలోగా అక్రమ కట్టాడాలను తొలగించుకోవాలని లేకుంటే తామే కట్టాడాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. వారి వెంట ఏఈ రాజేశం, నగర పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
Advertisement
Advertisement