
రమణీయం.. భూతప్పల ఉత్సవం
మడకశిర మండలంలోని భక్తరహళ్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి, జిల్లేడుగుంట శ్రీ ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి.
మడకశిర మండలంలోని భక్తరహళ్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి, జిల్లేడుగుంట శ్రీ ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం నిర్వహించిన భూతప్పల ఉత్సవం రమణీయంగా సాగింది. వేలాది భక్తుల కోలాహలం మధ్య భూతప్పలు చిందులు తొక్కారుళ్లెంతో నిష్టతో తడి గుడ్డలతో బోర్ల పడుకున్న భక్తుల మీద నుంచి భూతప్పలు నడుచుకుంటూ వెళ్లారు. ఆ సమయంలో లక్ష్మీనరసింహ స్వామి నామస్మరణతో ఆ ప్రాంతాలు మార్మొగాయి. ఇలా చేయడం వల్ల తమ కష్టాలు తీరుతాయని భక్తుల విశ్వాసం. భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు, సీఐ దేవానంద్, పలువురు ఎస్ఐలు, సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.