ఆటో బోల్తా.. ఒకరి మృతి | auto rolls and one dies | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా.. ఒకరి మృతి

May 9 2017 11:15 PM | Updated on Mar 9 2019 4:28 PM

ఆటో బోల్తా.. ఒకరి మృతి - Sakshi

ఆటో బోల్తా.. ఒకరి మృతి

గోరంట్ల మండలం మల్లాపల్లి సమీపంలోని లేపాక్షి గ్రీన్‌ సిటీ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుమ్మయ్యగారిపల్లికి చెందిన నరసింహప్ప(52) అనే వ్యక్తి మృతి చెందారు.

గోరంట్ల (సోమందేపల్లి) : గోరంట్ల మండలం మల్లాపల్లి సమీపంలోని లేపాక్షి గ్రీన్‌ సిటీ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుమ్మయ్యగారిపల్లికి చెందిన నరసింహప్ప(52) అనే వ్యక్తి మృతి చెందారు. ఆటో డ్రైవర్‌ ఫకృద్దీన్‌, ప్రయాణికులు ఉబేద్, ఫయాజ్, బాబుసాబ్‌ గాయపడ్డారు. గోరంట్ల నుంచి ప్రయాణికులతో హిందూపురం వైపు బయలుదేరిన ఆటో మార్గమధ్యంలో గ్రీన్‌సిటీ వద్దకు చేరుకోగానే అదుపు తప్పి బోల్తాపడటంతో ఈ ఘటన జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న నరసింహప్పకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం హిందూపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement