అంబేడ్కర్ వర్సిటీ ఇన్చార్జి వీసీ చంద్రయ్య
ఎచ్చెర్ల క్యాంపస్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ, దాని అనుబంధ కళాశాలల్లో ఎవరైనా ర్యాగింగ్పై పాల్పడితే బహిష్కరిస్తామని వర్సిటీ ఇన్చార్జి వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య అన్నారు. ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు వర్సిటీ చేపట్టిన ర్యాగింగ్ నిర్మూలన చర్యలు, భవిష్యత్లో ర్యాగింగ్ పట్ల వ్యవహరించే విధానాలను అధికారులు పరిపాలనా కార్యాలయంలో మంగళవారం వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్కు పాల్పడే విద్యార్థులను వర్సిటీ నుంచి బహిష్కరిస్తామని చెప్పారు. నేరం ఎక్కువగా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, విద్యార్థులపై ర్యాగింగ్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం వర్సిటీలో తరగతి గదులు, వసతి గృహం, క్యాంపస్ ప్రాంగణంలో నిఘా పెట్టామని, కొన్ని చోట్ల సీసీ కెమెరాలు వినియోగిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు తమ బాధ్యతలు విస్మరిస్తే విలువైన జీవితం కోల్పోతారని అన్నారు. ప్రతి విభాగంలో ప్రత్యేక ర్యాగింగ్ అవగాహన సదస్సులు న్యాయ నిపుణలతో పెట్టామన్నారు. ర్యాగింగ్కు పాల్పడే విద్యార్థులు పట్ల ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలి సైతం తీవ్ర నేరంగా పరిగణిస్తున్నాయని చెప్పారు. రాత్రులు సైతం వసతి గృహం పరిశీలిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు నియమావళి మేరకు ర్యాగింగ్ కేసులు క్రిమినల్ కేసులు కంటే తీవ్రంగా పరిగణించబడతాయని తెలిపారు. యూనివర్సిటీలో పటిష్టమైన యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ వ్యవస్థ ఉందని వివరించారు. రిజస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పెద్దకోట చిరంజీవులు పాల్గొన్నారు.
ర్యాగింగ్కు పాల్పడితే... బహిష్కరణ
Published Wed, Nov 23 2016 3:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ సభ
వేద విజ్ఞానం కలిగిన భూమి భారత్
కాంగ్రెస్లో మున్సిపల్ కౌన్సిలర్ల చేరిక
పేదల సంక్షేమానికి పెద్దపీట
కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం
ఓటేసిన ఆర్వో
ధాన్యం దిగదు.. లారీ కదలదు
● జనసంద్రంగా ఐబీ చౌరస్తా ● మంచిర్యాలలో రోడ్షో
నేడు నీట్
డీఏవోగా సురేఖ బాధ్యతల స్వీకరణ
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement