ఇరు వర్గాల ఘర్షణ: 9 మందికి గాయాలు | Sakshi
Sakshi News home page

రెండు కుటుంబాల మధ్య ఘర్షణ

Published Thu, Aug 11 2016 12:08 PM

9 injured in two groups attrition in east godavari district

తుని : తూర్పుగోదావరి జిల్లా తుని మండలం దొండవాకలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆస్తి విషయంలో జరిగిన గొడవలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తుని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement