జిల్లా వ్యాప్తంగా మద్యం షాపుల నిర్వహణ కోసం ఆన్లైన్లో 675 దరఖాస్తులు వచ్చాయి.
మద్యం దుకాణాల కోసం 675 దరఖాస్తులు
Mar 28 2017 10:25 PM | Updated on Sep 5 2017 7:20 AM
కర్నూలు(టౌన్) : జిల్లా వ్యాప్తంగా మద్యం షాపుల నిర్వహణ కోసం ఆన్లైన్లో 675 దరఖాస్తులు వచ్చాయి. వీటిని మంగళవారం డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో అధికారులు పరిశీలించారు. 215 దరఖాస్తులను మొదటి విడతగా పరిశీలించారు. మొత్తం దరఖాస్తుల్లో కర్నూలు డివిజన్కు 285, నంద్యాల డివిజన్కు 390 వచ్చాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు తెలిపారు. బుధవారం ఉగాది పండుగ రోజున కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తుల రూపంలో ఎక్సైజ్ శాఖకు రూ.85 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
Advertisement
Advertisement