టిప్పర్‌- ఆర్టీసీ బస్సు ఢీ... ఒకరు మృతి | Sakshi
Sakshi News home page

టిప్పర్‌- ఆర్టీసీ బస్సు ఢీ... ఒకరు మృతి

Published Sat, Feb 13 2016 6:14 AM

40 injuried in rtc bus-tipper collision in rangaredddy district

రంగారెడ్డి: హయత్ నగర్ మండలం బాట సింగారం వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు, టిప్పర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ ముస్తఖ్ క్యాబిన్లోనే ఇరుక్కు పోయి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు బస్సులోనే ఇరుక్కుపోయారు. 40 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్ నిబంధనలు పాటించకపోవడంతోనే రోడ్డు ప్రమాదం జరిగనట్టు సమాచారం.

Advertisement
Advertisement