ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 21న పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్మేళాను ఉంటుందని ఏపీఎస్ఎస్డీసీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ టీహెచ్.విన్సెంట్, స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జ్ఞానేశ్వర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
గుంతకల్లు టౌన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 21న పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్మేళాను ఉంటుందని ఏపీఎస్ఎస్డీసీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ టీహెచ్.విన్సెంట్, స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జ్ఞానేశ్వర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ జాబ్మేళాకు టెక్ మహేంద్ర, ఎల్అండ్టీ, హెటెరో డ్రగ్స్, వినూత్న ఫర్టిలైజర్స్, పొలారిస్, ఫ్లిప్కార్ట్, ఇంటలెంట్ గ్లోబల్ సర్వీసెస్, డేటావిండ్, అపోలో, కార్వెల్లో సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. పదోతరగతి పాస్ లేదా ఫెయిల్తో పాటు ఏదైనా డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ పూర్తిచేసిన వారు అర్హులన్నారు. వివరాలకు సెల్: 90599 38727, 81434 20834, 98859 43819లో సంప్రదించాలన్నారు.