'21.96 లక్షల మంది పుణ్యస్నానాలు' | 21.96 lakhs of devotees came to Puskaras at Vijayawada | Sakshi
Sakshi News home page

'21.96 లక్షల మంది పుణ్యస్నానాలు'

Aug 14 2016 2:20 PM | Updated on Sep 4 2017 9:17 AM

కృష్ణా పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు.

విజయవాడ: కృష్ణా పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు 21.96 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో వెల్లడించారు. పుష్కరాల సందర్భంగా డ్రోన్‌, సెల్‌ఫోన్‌ కెమెరాలతో ట్రాఫిక్‌, రద్దీని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. రేపటి నుంచి 4 లక్షల మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ చేయనున్నట్టు చంద్రబాబు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement