15 మంది విద్యార్థినులకు అస్వస్థత | 15 Study circle girl students to get illness taking bath of polluted water | Sakshi
Sakshi News home page

15 మంది విద్యార్థినులకు అస్వస్థత

Jun 13 2016 8:33 PM | Updated on Nov 9 2018 5:02 PM

కలుషిత నీటి వినియోగంతో 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

హసన్‌పర్తి(వరంగల్): కలుషిత నీటి వినియోగంతో 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలం కోమటిపల్లిలో సోమవారం వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న ఎస్సీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్ 2 కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థినులు కలుషిత నీటితో స్నానం చేయడంతో... అస్వస్థతకు గురయ్యారు.

స్టడీ సర్కిల్‌లో 30 మంది విద్యార్థినులు ఉండగా.. అందులో 15 మంది విద్యార్థినులకు చర్మం మీద పొక్కులు, దురద, బెందులు ఏర్పడ్డాయి. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement