విషాదంలో ఉబర్‌ సీఈఓ

విషాదంలో ఉబర్‌ సీఈఓ - Sakshi


కాలిఫోర్నియా:

ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఉబెర్‌ సీఈవో ట్రావిస్‌ కలా నిక్‌ తల్లి బోనీ కలానిక్‌ (71) బోటు ప్రమాదంలో మరణించారు. తండ్రి డొనాల్డ్‌ కలానిక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరు కాలిఫోర్నియా ఫ్రెస్నోలోని పైన్‌ఫ్లాట్‌ సరస్సులో విహరిస్తుండగా ప్రమాదం జరిగింది.



వారి బోటు ఓ పెద్ద బండరాయిని ఢీకొని మునిగిపోయినట్టు పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డొనాల్డ్‌ కలానిక్‌ స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై నగర షెరిఫ్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేస్తూ ట్రావిస్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ట్రావిస్‌ కుప్పకూలిపోయారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top