ఒకరు నమ్మించి... మరొకరు బెదిరించి  | Woman Molested In vizianagaram District | Sakshi
Sakshi News home page

ఒకరు నమ్మించి... మరొకరు బెదిరించి 

Dec 19 2019 10:22 AM | Updated on Dec 19 2019 10:34 AM

Woman Molested In vizianagaram District - Sakshi

చీపురుపల్లి రూరల్‌: ఒక వ్యక్తి ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి వాంఛ తీర్చుకున్నాడు. చివరికి ఆ వ్యక్తి మాయమాటల్లో పడి ఆ యువతి మోసపోయింది. అదే గ్రామానికి చెందిన మరో యువకుడు వీరద్దరి ప్రేమ వ్యవహారాన్ని తెలుసుకొని శారీరక వాంఛ తీర్చాలంటూ ఆ యువతిని భయపెట్టాడు. వారి ప్రేమ వ్యవహారాన్ని గ్రామంలో చెప్పి బయట పెడతానని చెప్పి బెదిరించాడు. ఈ వ్యవహారం గ్రామంలో తెలిస్తే తమ కుటుంబం పరువు ఎక్కడ పోతుందోనని భయపడిన ఆ యువతి ఆ యువకుడికి కూడా లొంగిపోయింది.

ఇలా కొన్నాళ్లు గడిచిన తరువాత ఆ యువతిలో శారీరక మార్పులు రావటంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆ యువతిని ఏమయ్యిందని ఇంట్లో నిలదీశారు. విషయం తెలుసుకొని డాక్టర్‌ వద్దకు తీసుకువెళ్లగా ఆమె గర్బవతి అయిందని తేలింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని రామలింగాపురం పంచాయతీ పరిధి పుర్రేయవలస గ్రామంలో ఈ ఘటన జరిగింది. పుర్రేయవలస గ్రామానికి చెందిన వివాహితుడు సంగిరెడ్డి రామారావు అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడు. ఈ విషయం తెలుసుకున్న మరో యువకుడు బూటు పైడిరాజు ఆ యువతిని బెదిరించి వాంఛ తీర్చుకున్నాడు. ఆమె గర్భవతి కావడంతో గ్రామ పెద్దలకు తెలియజేసింది. అక్కడ న్యాయం జరగకపోవడంతో మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement