ముగ్గురు కుమార్తెలతో బావిలో దూకిన తల్లి

Woman Commits Suicide With Three Children In Anantapur District - Sakshi

సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తల్లి తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన పుట్టపర్తి మండలం పెద్దమ్మవారిపల్లిలో జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు కుమార్తెలు మృతిచెందగా, తల్లిని స్థానికులు కాపాడారు. ఈ ఘటనలో కుమార్తెలు భవ్య(8),భార్గవి(8), చందన(5) మృతి చెందారు. తల్లి అరుణను ఆసుపత్రికి తరలించారు. తల్లి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top