భర్త ఇంటి ముందు భార్య దీక్ష

Wife Protest Infront Of Husband Home - Sakshi

న్యాయం చేయాలని ఐద్వా ఆధ్వర్యంలో బైఠాయింపు

సోన్‌(నిర్మల్‌): భర్త కుటుంభ సభ్యులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ భర్త ఇంటి ముందు ఐద్వా సంఘం ఆధ్వర్యంలో మంళవారం భార్య బైటాయించింది. ఈ ఘటన మండలంలోని కడ్తాల్‌ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బర్మ శరణ్య, కొండ్ర రామకృష్ణ గత కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో జనవరి 31న హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు.

ఆత్మరక్షణ కోసం సోన్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీసులు కుటుంబ సభ్యులకు ప్రేమ జంటను అప్పగించారు. అయితే గత కొన్ని రోజుల నుంచి వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్త కుటుంబ సభ్యులు తరచూ వేధిస్తున్నారని భార్య ఆరోపిస్తూ ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత మాట్లాడారు. శరణ్యకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇందులో సంఘ నాయకురాలు మేఘన, సుజాత ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top