విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి | Tenth Class Student Dragged Inside Flat Gangraped | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి

Oct 15 2018 11:05 AM | Updated on Oct 15 2018 11:05 AM

Tenth Class Student Dragged Inside Flat Gangraped - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తెలిసిన వ్యక్తే కదా అని వెళితే..

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని వినోద్‌ నగర్‌లో పదో తరగతి విద్యార్థినిపై శనివారం నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరైన అమిత్‌ కుమార్‌ బాధిత బాలిక కుటుంబానికి తెలిసిన వ్యక్తి కావడం గమనార్హం. సమీప పార్క్‌లో కలువాలని బాలికను కుమార్‌ తీసుకెళ్లగా అక్కడ మరో ముగ్గురు నిందితులు కిషన్‌ నేగి (42), పంకజ్‌ మెహతా (42) రాజు కుమార్‌ (20)లు కలిశారు.

బాలికను పార్క్‌ నుంచి సమీప ఫ్లాట్‌లోకి తీసుకెళ్లిన నిందితులు అక్కడ ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుడు బాధితురాలిని బలవంతంగా సమీప ఫ్లాట్‌కు తీసుకెళ్లి నేరానికి పాల్పడ్డాడని కళ్యాణ్‌పురి పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

మరోవైపు పశ్చిమ ఢిల్లీలోని ద్వారకలో ఓ మల్టీనేషనల్‌ కంపెనీలో పనిచేసే యువతిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆఫీస్‌ పనులు ముగించుకుని వచ్చిన యువతిని లిఫ్ట్‌ ఇస్తామని చెప్పిన నిందితులు మార్గమధ్యంలో ఆమెకు మత్తు మందు కలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చి అపస్మారకస్ధితిలోకి వెళ్లిన బాధితురాలిని ఫ్లాట్‌లోకి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. నేరానికి పాల్పడిన అనంతరం బాధితురాలిని వసంత్‌కుంజ్‌ ప్రాంతంలో వదిలివెళ్లారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement