ఉపాధ్యాయులు మందలించారని... | Student cummit to suicide because of teachers censured | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులు మందలించారని...

Nov 27 2017 2:59 AM | Updated on Nov 27 2017 2:59 AM

Student cummit to suicide because of teachers censured - Sakshi

హైదరాబాద్‌: మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థిని ఉపాధ్యాయులు మందలించడంతో  భవనంపై నుంచి దూకి గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన రాజిరెడ్డి కుమార్తె రాజేశ్వరి బాచుపల్లిలోని పూజిత ఎన్‌క్లేవ్‌లో ఉన్న శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 23న ఇంటర్‌ పరీక్షల్లో రాజేశ్వరి మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడటంతో ఉపాధ్యాయులు మందలించారు. దీంతో విద్యార్థిని భవనం మొదటి అంతస్తు నుంచి కిందకు దూకేసింది. వెంటనే కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే సికింద్రాబాద్‌లోని సన్‌షైన్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించింది. తండ్రి రాజిరెడ్డి రాగానే కుమార్తెను అప్పగించినట్లు సమాచారం. అయితే రాజేశ్వరికి చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement