నక్కపల్లి వద్ద రోడ్డుప్రమాదం | Road accident at Nakkapalli | Sakshi
Sakshi News home page

నక్కపల్లి వద్ద రోడ్డుప్రమాదం

Apr 27 2018 1:19 PM | Updated on Aug 30 2018 4:20 PM

నక్కపల్లి(పాయకరావుపేట) : జాతీయరహదారిపై నక్కపల్లి సమీపంలో  జరిగిన రోడ్డుప్రమాదంలో ఏడుగురు   గాయపడ్డారు.  అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని తిరుగుప్రయాణంలో ఇంటివెళ్తున్న వారు ప్రమాదానికి గురయ్యారు. ఎస్‌ఐ సింహాచలం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి చెందిన బొక్కు సత్యం కుటుంబ సభ్యులు  గురువారం అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్లారు.

దర్శనం అనంతరం తిరిగి తమ గ్రామానికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారును నక్కపల్లి సమీపంలో వెనుకనుంచి వస్తున్న కోళ్లవ్యాన్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో  సత్యం, అతని భార్య పార్వతి,కొడుకు  ఎల్లం నాయుడు, కోడలు అన్నపూర్ణ, మనుమలు రాకేష్,లోకేష్‌ కారుడ్రైవర్‌ ఆదినారాయణ   గాయపడ్డారు. వీరిని నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.వీరిలో ఎల్లంనాయుడు, పార్వతి, అన్నపూర్ణలకు తీవ్రగాయాలై పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.లత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement