విమానంలో బాంబు కలకలం.. అదుపులోకి యువతి

Plane Makes Emergency Landing At Kolkata Airport After Woman Claims She Has Bombs - Sakshi

కోల్‌కతా :  ఓ యువతి చేసిన నిర్వాకానికి  కోల్ కతా ఎయిర్ పోర్ట్ నుంచి ముంబైకి బయలుదేరిన ఎయిర్‌ ఏషియన్‌ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సివచ్చింది. తన శరీరంలో బాంబు ఉందని, దానిని ఏ క్షణంలోనైనా పేల్చేస్తానని బెదిరించడంతో కంగుతిన్న ఫైలెట్‌.. విమానాన్ని కోల్‌కతాఎయిర్‌ పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు.

మోహిని మొండల్‌ (25) శనివారం రాత్రి 9.57 గంటలకు ఎయిర్‌ ఏషియన్‌ విమానంలో కోల్‌కతా నుంచి ముంబై బయలు దేరింది. మార్గమద్యలో తన కేబిన్‌ సిబ్బందికి ఒక లెటర్‌ ఇచ్చి అది ఫ్లైట్‌ కెప్టెన్‌కు అందివాల్సిందిగా కోరింది. తన శరీరం చుట్టూ బాంబులు ఉన్నాయని, వాటిని ఏ క్షణమైనా పేల్చేస్తానని లేఖలో హెచ్చరించింది. దీంతో కంగుతిన్న పైలట్‌..అధికారులకు సమాచారం అందించి కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం మోహిని మెండల్‌ను ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి శనివారం రాత్రి 11.46 గంటలకు తిరిగి పంపించారు. కాగా, మోహిని శరీరంలో బాంబు లేదని, ఆమె ఎందుకు అలా బెదిరించిందో  విచారణలో తేలుతుందని అధికారులు పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top