కుమార్తెను కడతేర్చి తల్లి ఆత్మహత్య | Mother Killed Daughter And Commits Suicide | Sakshi
Sakshi News home page

కుమార్తెను కడతేర్చి తల్లి ఆత్మహత్య

May 12 2018 8:08 AM | Updated on Nov 6 2018 8:16 PM

Mother Killed Daughter And Commits Suicide - Sakshi

మృతి చెందిన కలైసెల్వి, ధనశ్రీ (ఇన్‌సెట్‌) కలైసెల్వి (ఫైల్‌)

తమిళనాడు, అన్నానగర్‌: కుటుంబకలహాలతో విరక్తి చెంది కుమార్తెను బావిలో తోసి హత్య చేసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ధర్మపురి జిల్లా పాలకోడులో చోటుచేసుకుంది. పాలకోడు సమీపం మణియకారన్‌కొట్టాయ్‌ గ్రామానికి చెందిన శ్రీనివాసన్‌ (40) రైతు. ఇతని భార్య కలైసెల్వి (35). వీరి కుమార్తె ధనశ్రీ (05). రెండేళ్లుగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో కలైసెల్వి మనస్తాపం చెంది మోరప్పూర్‌ సమీపం సింథల్‌పాడి గ్రామంలో ఉన్న పుట్టింటికి వెళ్లడం, తరువాత శ్రీనివాసన్‌ అక్కడికి వెళ్లి భార్యను సమాధానం పరిచి తీసుకుని వెళ్లడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో శ్రీనివాసన్‌ తరచూ భార్య వద్ద నువ్వు చనిపోతే నేను ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు.

దీంతో మనస్తాపం చెందిన కలైసెల్వి గ్రామ పంచాయతీ అధికారులకు, బంధువులకు పలుమార్లు ఫిర్యాదు చేసింది. అయినా ప్రయోజనం లేదు. ఈ నేపథ్యంలో బుధవారం దంపతుల మధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో విరక్తి చెందిన కలైసెల్వి కుమార్తెతో బయటికి వెళ్లింది. చాలా సేపయినా తిరిగి రాలేదు. బంధువులు పలుచోట్ల వెతికినా ఆచూకీతెలియలేదు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం బంధువులు కలైసెల్వి తోటలో ఉన్న బావిలో అనుమానించి చూశారు. అప్పుడు కలైసెల్వి, ధనశ్రీ నీటిలో మునిగి మృతి చెంది ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. వెంటనే ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement