కాశీబుగ్గ : దసరా పండగ నిమిత్తం భార్యను కన్నవారింట్లో చేర్చి తిరుగు ప్రయాణమైన భర్త కొద్దిసేపటికే మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి పూండి రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పలాస జీఆర్పీ ఎస్ఐ కె.రవికుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నందిగాం మండలం కొండపేట గ్రామానికి చెందిన చాందినితో సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన వల్లభ హరిప్రసాద్ (31)కు ఈ ఏడాది మార్చి 10న వివాహమైంది. ఈయన చిన్నచిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ విశాఖలోనే ఉంటున్నాడు. భార్యను దసరా పండగ సందర్భంగా ఇటీవలే కన్నవారింటికి పంపించాడు. శనివారం బంధువుల ఇంట్లో శుభకార్యం ఉందని వజ్రపుకొత్తూరు మండలం పొల్లాడ చేరుకున్నాడు. అక్కడికే తన భార్య చాందిని కూడా చేరుకుని ఇద్దరూ అన్యోన్యంగా గడిపారు. తిరిగి ఆదివారం రాత్రి కొండపేటకి వెళ్లి భార్యను కన్నవారింట్లో అప్పగించి దసరా సందడి ముగించుకుని తర్వాత విశాఖ వచ్చేయాలని సూచించి బయలుదేరాడు. అక్కడి నుంచి మిత్రుని బైకుపై సొంత గ్రామానికి బయలుదేరిన కొద్ది గంటలకే మృత్యువాతపడ్డాడు.
వజ్రపుకొత్తూరు మండలం పూండి రైల్వేష్టేషన్కు కూతవేటు దూరంలో చరణుదాసుపురం 4వ ఫోల్ వద్ద ఆదివారం రాత్రి ఊహించని రీతిలో శవమై కనపడ్డాడు. శరీరం ముక్కలుముక్కలుగా పడి ఉండటంతో గుర్తు పట్టలేకపోయారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలాని చేరుకుని ఆరా తీయగా ఫ్యాంటు జేబులో ఆధార్ కార్డు దొరికింది. అందులోని వివరాల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడి నుంచి కొండపేటలోని అత్తవారింటికి వెళ్లిన పోలీసులు పలు అంశాలపై ఆరా తీశారు. ఎలాంటి తగాదాలు లేవని చెప్పడంతో అనుమానాస్పద కేసుగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహం సమీపంలోనే ద్విచక్ర వాహనం పార్కింగ్ చేసి ఉందని, పలాస–విశాఖ రైలు ఢీకొట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి
Published Tue, Oct 3 2017 3:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement