లేబర్‌ ఆఫీసర్‌ ఆనంద్‌రెడ్డి దారుణ హత్య

Khammam Labour Officer Anand Reddy Assasinated At Bhupalpally Forest - Sakshi

సీఐ ప్రశాంత్‌రెడ్డి సోదరుడిపై హత్యా ఆరోపణలు

సాక్షి, వరంగల్‌ : ఖమ్మం లేబర్‌ ఆఫీసర్‌ ఆనంద్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఆనంద్‌రెడ్డి.. భూపాలపల్లి జిల్లా గోళ్లబుద్ధరం అడవులల్లో హత్యకు గురయినట్టు పోలీసులు గుర్తించారు. ఆనంద్‌రెడ్డిని సీఐ ప్రశాంత్‌రెడ్డి సోదరుడు ప్రదీప్‌రెడ్డి  హత్యచేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. 

వివరాల్లోకి వెళితే.. ఆనంద్‌రెడ్డి మూడు రోజుల కిందట హన్మకొండలో కిడ్నాప్‌ అయ్యారు. నగరంలోని ఒక హోటల్‌ నుంచి బయటకు వెళ్లిన ఆనంద్‌రెడ్డి.. ఆ తర్వాత కనిపించకుండా పోయారని అతని కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆనంద్‌రెడ్డి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు భూపాలపల్లి అడవుల్లో ఆనందర్‌రెడ్డి ఫోన్‌ సిగ్నల్స్‌ నిలిచిపోయినట్టు గుర్తించిన పోలీసులు.. ఆ దిశలో విచారణ చేపట్టారు. మరోవైపు ఆనంద్‌ను ప్రదీప్‌ తీసుకెళ్లిన కారును పోలీసులు హైదరాబాద్‌లో గుర్తించారు. కారును వాష్‌ చేసి అల్వాల్‌లోని స్నేహితుడి ఇంటివద్ద వదిలివెళ్లినట్టుగా తెలుస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top