అమెరికాలో పాతబస్తీ యువకుడి మృతి | Hyderabad Local Person Died in America | Sakshi
Sakshi News home page

అమెరికాలో పాతబస్తీ యువకుడి మృతి

Jun 25 2019 8:33 AM | Updated on Jun 25 2019 8:33 AM

Hyderabad Local Person Died in America - Sakshi

సయ్యద్‌ వసీం అలీ (ఫైల్‌)

డబీర్‌ఫురా: అమెరికాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం లో పాతబస్తీలోని డబీర్‌పురా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కాలిఫోర్నియా ప్రీమాంట్‌లోని వాల్‌నట్‌ ఏవ్‌లో నివాసముంటున్న సయ్యద్‌ వసీం అలీ (27) ఆదివారం తాను ప్రయాణిస్తున్న కారు అవెన్యూ కూడలి వద్ద మరో కారును ఢీకొట్టింది. ఈ సంఘటనలో సయ్యద్‌ వసీం అలీ తీవ్ర గాయాలకు గురి కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు వసీం అలీ కుటుంబ సభ్యులు విదేశాంగ వ్యవహరాల శాఖ మంత్రి డాక్టర్‌ ఎస్‌. జయశంకర్‌ను కలిసి సయ్యద్‌ వసీం అలీ మృతదేహన్ని భారతదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement