మద్యం మత్తులో.. బీరుసీసాలతో దాడి! | Four Attacked Each Others With Beer Bottles In Vemulawada | Sakshi
Sakshi News home page

Nov 8 2018 7:08 AM | Updated on Nov 8 2018 7:08 AM

Four Attacked Each Others With Beer Bottles In Vemulawada - Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్లా : హనుమాజీ పేట గ్రామంలోని పర్మిట్‌ రూమ్‌ వద్ద నలుగురు వ్యక్తులు నానా హంగామాచేశారు. మద్యం మత్తులో ఒకరిపైఒకరు బీరు సీసాలతో దాడి చేసుకున్నారు. పాత కక్షలతోనే ఒకరిపై ఒకరు ఈ దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వేములవాడ రూరల్‌ పోలీసుల కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. 

వేములవాడ మండలం మల్లారంకు చెందిన గంగరాజు, ప్రవీణ్‌, జానీలతో పాటు చందుర్తి మండల మూల పల్లెకు చెందిన ప్రశాంత్‌లు పర్మిట్‌ రూమ్‌లో మద్యం సేవిస్తూ ఉండగా.. మాటలతో వాగ్వాదానికి దిగారు. మద్యం మత్తులో బీరుసీసాలతో కొట్టుకున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించారు. మిగతా ముగ్గురిని వేములవాడ ఆసుపత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement