రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఐదుగురి మృతి

Fire Accident In Residential Building In Himachal Pradesh - Sakshi

హిమాచల్‌ ప్రదేశ్‌: రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. మరికొంత మంది బిల్డింగ్‌లో చిక్కుకుపోయారు. ఈ సంఘటన హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రం మండీ ప్రాంతంలోని నెర్‌ చౌక్‌లో జరిగింది. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ జరుగుతోంది.  ఎల్‌పీజీ సిలిండర్‌ అకస్మాత్తుగా పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మండీ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ మెజిస్ట్రేట్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top