ఏసీబీకి పట్టుబడ్డ లైన్‌మన్‌ | Sakshi
Sakshi News home page

ఏసీబీకి పట్టుబడ్డ లైన్‌మన్‌

Published Mon, Sep 9 2019 2:40 PM

ACB Attack On AE Office At Pedda Shahpur - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌లోని పెద్ద షాపూర్ ఏఈ కార్యాలయంలో లైన్‌మన్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. పెద్ద షాపూర్ ఏఈ కార్యాలయంలో లైన్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎస్. కాశీరాములు.. తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో మీటర్ ఫిట్ చేసినందుకు 50 వేలు లంచం కావాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో లంచం తీసుకుంటుండగా లైన్‌మన్‌ను పట్టుకున్నారు. సోమవారం రూ.28 వేలు లంచం తీసుకుంటూ కాశీరాములు ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు.

Advertisement
Advertisement