ఏడుగురు విద్యార్థుల దుర్మరణం

7 Hislop students die in Amravati Road car crash - Sakshi

సాక్షి, ముంబై: కారు అదుపు తప్పడంతో అందులో షికారుకు బయలుదేరిన 8 మంది విద్యార్థుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌లోని హిస్లాప్‌ కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం ఎర్టిగా కారులో షికారుకు బయలుదేరారు.

నాగ్‌పూర్‌–అమరావతి రోడ్డుపై హైల్యాండ్‌ పార్క్‌ ప్రాంతంలో వేగంగా వెళ్తున్న వీరి కారు అదుపు తప్పడంతో డివైడర్‌ను బలంగా ఢీకొని పక్కనే నిలిపి ఉంచిన ట్రక్కుకిందకు దూరిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు యువతులు సహా ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. కారులో మద్యం, సిగరెట్లు లభించినప్పటికీ.. విద్యార్థులు మద్యం సేవించారన్న దానిపై ఎలాంటి స్పష్టతా లేదన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top