బెంజ్ నుంచి కొత్త కార్లు.. ధర, ఫీచర్లు ఇవిగో! | The New Limited Edition ‪‎Mercedes Benz ‪E Class Launched in India Today | Sakshi
Sakshi News home page

బెంజ్ నుంచి మరో మూడు కార్లు.. ధర, ఫీచర్లు ఇవిగో!

Feb 24 2016 5:10 PM | Updated on Sep 3 2017 6:20 PM

బెంజ్ నుంచి  కొత్త కార్లు.. ధర, ఫీచర్లు ఇవిగో!

బెంజ్ నుంచి కొత్త కార్లు.. ధర, ఫీచర్లు ఇవిగో!

భారత మార్కెట్లోకి అడుగుపెట్టి 20 ఏళ్లైన సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ కంపెనీ ఇ-క్లాస్‌లో కొత్త కార్లను పరిమిత సంఖ్యలో విడుదల చేసింది.

‪‎న్యూఢిల్లీ: భారత మార్కెట్లోకి అడుగుపెట్టి 20 ఏళ్లైన సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ కంపెనీ ఇ-క్లాస్‌లో కొత్త కార్లను పరిమిత సంఖ్యలో విడుదల చేసింది. ‘ఎడిషన్-ఇ’ పేరుతో విడుదలైన ఈ లగ్జరీ కారు ఇ200, ఇ250, ఇ350 సీడీఐ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. పెట్రోల్‌తో నడిచే ఇ200 ధర రూ.48.6 లక్షలు కాగా మిగతా రెండూ డీజిల్ కార్లు. ఇందులో ఇ250 ధర రూ.50.7 లక్షలు, ఇ350 సీడీఐ ధర రూ.60.61 లక్షలు. (ఇవి ఢిల్లీ ధరలు). 

బెంజ్‌కు 2015 సంవత్సరం నిరాశను మిగిల్చింది. ఈ ఏడాది ఇ-క్లాస్ కార్లతో కంపెనీ సంబరాలు చేసుకుంటోంది. భారత్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించి రెండు దశాబ్దాలు పూర్తయినందున పాత ఇ-క్లాస్ కార్లన్నింటినీ కంపెనీ ప్రదర్శించింది. 20 ఏళ్ల కిందట మెర్సిడెస్ బెంజ్ డబ్ల్యూ124 అనే ఇ-క్లాస్ కారు విడిభాగాలను తీసుకొచ్చి భారత్‌లోనే వాటిని అమర్చి అమ్మడం ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. తర్వాత 2002లో డబ్ల్యూ210, 2009లో 211 కార్లను తీసుకొచ్చింది. ఇప్పటికీ భారత్‌లో ఎక్కువగా అమ్ముడవుత్ను లగ్జరీ కారు 211. పాత కార్లతో పోలిస్తే ‘ఎడిషన్-ఇ’లో ఇంజిన్‌కు సంబంధించి మార్పులేమీ చేయలేదు. గార్మిన్ నేవిగేషన్ సిస్టంతో పాటు వెనుక సీట్లలోని వారికి ఎంటర్‌టెయిన్‌మెంట్ యూనిట్‌ను కొత్తగా అమర్చారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement