బడ్జెట్లో కొన్ని.. | some main points in union budget 2016-2017 | Sakshi
Sakshi News home page

బడ్జెట్లో కొన్ని..

Mar 1 2016 2:28 AM | Updated on Aug 20 2018 9:16 PM

బడ్జెట్లో కొన్ని.. - Sakshi

బడ్జెట్లో కొన్ని..

పన్ను వివాదాల్లో చిక్కుకున్న సంస్థలు అసలును కట్టేసి.. వడ్డీ, పెనాల్టీ నుంచి మినహాయింపు పొందవచ్చని, తద్వారా కేసును పరిష్కరించుకోవచ్చని వొడాఫోన్..

పన్ను వివాదాల్లో చిక్కుకున్న సంస్థలు అసలును కట్టేసి.. వడ్డీ, పెనాల్టీ నుంచి మినహాయింపు పొందవచ్చని, తద్వారా కేసును పరిష్కరించుకోవచ్చని వొడాఫోన్, కెయిర్న్ వంటి సంస్థలకు జైట్లీ పరోక్షంగా సూచించారు.

దేశీ మైనింగ్ రంగానికి ఊతమిచ్చే విధంగా ప్రస్తుత బడ్జెట్‌లో తక్కువ గ్రేడ్ ఇనుప ఖనిజం (ఐరన్ ఓర్)పై ఉన్న ఎగుమతి సుంకాన్ని తొలగిస్తున ట్లు ప్రకటించారు.

ద్రవ్య విధాన కమిటీ(మోనేటరీ పాలసీ కమిటీ-ఎంపీసీ) ఏర్పాటు కోసం 1934 నాటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టాన్ని సవరించాలని తన బడ్జెట్లో ప్రతిపాదించారు. బెంచ్‌మార్క్ వడ్డీరేట్లను, ద్రవ్యోల్బణ లక్ష్యాలను ఈ ఎంపీసీ నిర్ణయిస్తుంది.

ఎగుమతిదారుల ప్రయోజనం ఉద్దేశించి..  ‘డ్యూటీ డ్రాబ్యాక్ స్కీమ్’ను విస్తృతం చేయనున్నట్లు జైట్లీ ప్రకటించారు. మరిన్ని ప్రొడక్టులు, దేశాలకు సంబంధించిన దిగుమతులకు ఈ పథకాన్ని విస్తరిస్తారు.

కమోడిటీ డెరివేటవ్స్ మార్కెట్లో ఆప్షన్ల వంటి మరిన్ని ట్రేడింగ్ సాధనాలను సెబీ అభివృద్ధి చేయనున్నదని జైట్లీ చెప్పారు. కార్పొరేట్ బాండ్ మార్కెట్‌ను మరింత విస్తరించే చర్యలు తీసుకోనున్నామని పేర్కొన్నారు.

సెక్యూరిటీస్ అప్పిల్లేట్ ట్రిబ్యూనల్(శాట్)కు సంబంధించి మరిన్ని బెంచ్‌ల ఏర్పాటు కోసం సెబీ చట్టాన్ని సవరించనున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ఇచ్చే ఉత్తర్వులను శాట్‌లో సవాల్ చేసే వీలుంది.

కేంద్ర ప్రభుత్వం కమ్యూనికేషన్ సర్వీసుల ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.98,995 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా వేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్‌లో పేర్కొన్నారు. స్పెక్ట్రమ్ వేలం సహా డాట్ విధించే పలు రకాల ఫీజులు కూడా ఇందులోకే వస్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement