
సాక్షి, న్యూఢిల్లీ : రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ నాలుగు నెలల గరిష్టాన్ని నమోదు చేసింది. జనవరి మాసంలో 2.05 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో 2.57 శాతానికి చేరింది. అటు ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి 1. 7 శాతానికి పడిపోయింది.
ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 2.05 శాతం నుంచి 2.57 శాతానికి పెరిగింది. ఫ్యాక్టరీ ఉత్పత్తి జనవరి నెలలో 2.4 శాతం నుంచి 1.7 శాతానికి క్షీణించింది.