Paytm Founder Vijay Shekhar Sharma Resigns As Paytm Financial Services Director - Sakshi
Sakshi News home page

పేటీఎం ఫౌండర్‌ అనూహ్య నిర్ణయం

Dec 11 2019 11:04 AM | Updated on Dec 11 2019 1:55 PM

Paytm founder Vi Shekhar Sharma steps down as Paytm Financial Services director - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:   ప్రముఖ చెల్లింపుల సంస్థ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పేటీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు   పేటీఎం ఫైనాన్షియల్‌  సర్వీసెస్‌ బోర్డుకు ఆయన డిసెంబరు 2న ఒక లేఖ రాశారని  ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ నివేదించింది. ఇతర బాధ్యతల  రీత్యా  ఈ పదవినుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టు విజయ్‌శేఖర్‌ తన లేఖలో పేర్కొన్నారు.

అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజా నిబంధనల నేపథ్యంలో ఆయన పేటీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది. చెల్లింపుల బ్యాంక్ ఛైర్మన్‌ ఎన్‌బిఎఫ్‌సి (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ) డైరెక్టర్ పదవిని చేపట్టడాన్ని ఆర్‌బీఐ ఇటీవల నిషేధించింది. బ్యాంకుకు చెందిన సబ్సిడరీగా పేమెంట్‌ సంస్థ వుంటే తప్ప డైరెక్టర్‌ పదవిలో ఛైర్మన్‌ ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజా పరిణామమని నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు సంస్థ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ లోహియాను డైరెక్టర్‌గా బోర్డు నియమించింది. కాగా పేటీఎం తన చెల్లింపుల బ్యాంకును 2017 మేలో భారతదేశంలో ప్రారంభించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement