* ఎన్డీఏ 260 సీట్లు దాటితేనే మార్కెట్లో ర్యాలీ
* 220 వద్ద ఆగిపోతే మార్కెట్ వర్గాలకు నిరాశే
* 200 మార్క్ దాటకపోతే పతనమే
* 12-18 నెలల్లో నిఫ్టీ లక్ష్యం 7,300-8,700
* కార్వీ స్టాక్ బ్రోకింగ్ నివేదిక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం మొత్తం ఎన్నికల ఫలితాల కోసం మే 16 వరకు ఎదురు చూడాల్సిందే. ఇప్పుడు అందరి దృష్టీ ఏ కూటమి అధికారంలోకి వస్తుందనే. ఎన్నికల తర్వాత సోమవారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ మంగళవారం మార్కెట్ కదలికలను ప్రభావితం చేయనున్నాయి. మోడీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందన్న అంచనాతో మార్కెట్లు దూసుకుపోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా మంగళవారం మార్కెట్ ఏ విధంగా స్పందించవచ్చు, వాస్తవ ఫలితాలు వెలువడిన తర్వాత మార్కెట్ కదలికలు ఎలా వుండవచ్చు. దీర్ఘకాలంలో మార్కెట్లు ఏ విధంగా ఉంటాయన్న దానిపై రాష్ట్రానికి చెందిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ఒక నివేదిక విడుదల చేసింది.
ఆ వివరాలు ....
మే 16 వరకు ఆగకుండానే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా మంగళవారం మార్కెట్లు భారీగా స్పందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోమవారం మార్కెట్లు ముగిశాక వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణంగా వుండటంతో మంగళవారం సూచీలు 2-3% గ్యాప్ అప్తో ప్రారంభమవుతాయని కార్వీ పేర్కొంది. మే 16న తుది ఫలితాలు విడుదల అయ్యేంతవరకూ నిఫ్టీ 7,000-7,300 శ్రేణిలో కదిలే అవకాశం ఉందని, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీఏ కూటమి తక్కువ సీట్లను పొందితే మాత్రం మార్కెట్లు కుప్పకూలతాయనడంలో సందేహం అక్కర్లేదని స్టాక్ బ్రోకింగ్ కంపెనీ వివరించింది. తుది ఫలితాల తర్వాత ఎన్డీఏ కూటమికి వచ్చే సీట్లు ఆధారంగా మార్కెట్ కదలికలను కార్వీ మూడు విభాగాలుగా విభజించింది.
ఎన్డీఏకు 260 దాటితే....
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 260 కంటే ఎక్కువ సీట్లు వస్తాయన్న భావనతోనే గత ఫిబ్రవరి నెల నుంచి మార్కెట్లు పరుగులు తీశాయి. వాస్తవ ఫలితాల్లో ఎన్డీఏకు 260 దాటి, పదేసి సీట్లు పెరుగుతున్న కొద్ది మార్కెట్లు మరింత ముందుకు పోతాయి. స్థిరమైన కూటమి అధికారంలోకి రావడమే కాకుండా ఆర్థిక వృద్ధి గాడిలో పెట్టే విధంగా సంస్కరణలు చేపట్టే అవకాశాలు ఉండటం మార్కెట్లకు శక్తినిచ్చే అంశం. ఇదే జరిగితే వచ్చే 6-9 నెలల్లో నిఫ్టీ 15 శాతం లాభాలను అందిస్తుంది.
220 సీట్ల వద్ద ఆగిపోతే...
ఎన్డీఏ కూటమి 220 సీట్ల దగ్గర ఆగిపోతే మొదటి సినారియోలోని వారు నిరాశకు గురవుతారు. ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మరికొన్ని పార్టీలతో జతకట్టాల్సి ఉంటుంది. దీంతో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుపై సందేహాలు పెరగడంతో పాటు సంస్కరణల అమలుపై నీలి నీడలు ఏర్పడొచ్చు. ఇలా జరిగితే వచ్చే 3 నెలలు మార్కెట్లు 5% శ్రేణిలో కదలొచ్చు.
200లోపు వస్తే....
ఒకవేళ ఎన్డీఏ కూటమికి 200 సీట్ల కంటే తక్కువ వస్తే అప్పుడు యూపీఏ మద్దతుతో మూడో ఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానమంత్రి అభ్యర్థిని వెతకడం దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ గందరగోళంగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో సూచీలు 15 - 20 శాతం క్షీణించే అవకాశం ఉంది.
మెజారిటీపై అంచనాలు-షేర్ల తీరు
స్టాక్ పేరు ప్రస్తుత ధర 260దాటితే 200లోపైతే
ఐసీఐసీఐ బ్యాంక్ 1,399 1,600 1,150
ఎల్అండ్టీ 1,387 1,600 1,100
ఎన్టీపీసీ 121 144 105
ఆర్ఐఎల్ 1,029 1,300 850
టాటా మోటార్స్ 455 500 375
యెస్ బ్యాంక్ 493 550 375
రిలయన్స్ ఇన్ఫ్రా 557 700 450
మోడీ ఎఫెక్ట్ మార్కెట్ దారెటు?
Published Tue, May 13 2014 1:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement