ఈ సెల్ఫీ ఫీచర్‌ ఫోన్‌ ధర తెలిస్తే..

M-tech launches affordable selfie feature phone - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ మొబైల్‌ మేకర్‌  ఎం.టెక్‌ అతి తక్కువ ధరకు ఫీచర్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది.  జీ 24పేరుతో ఈ సెల్ఫీ ఫీచర్‌ ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది.  బడ్జెట్‌ ధరలో 1.8 అంగుళాల డిస్‌ప్లే, 1000  ఎంఏహెచ్‌ బ్యాటరీ, డ్యుయల్‌ సిమ్‌, డ్యుయల్‌  డిజిటల్‌ కెమెరా లాంటి ఫీచర్లతో దీన్ని వినియో గదారులకు  అందిస్తోంది.   ప్రముఖ  మొబైల్‌, టెలికాం కంపెనీలన్నీ రూ.1000-1500 మధ్య ఫీచర్‌ ఫోన్‌ తీసుకొస్తే.  ఎం.టెక్‌మాత్రం కేవలం రూ. 899 లుగా  దీని ధరను ప్రకటించడం విశేషం.

16జీబీ దాకా ఇంటర్నల్‌​ మొమరీని విస్తరించుకోవచ్చని ఎంటెక్‌ ఇన్‌ఫర్మటిక్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ గౌతం  కుమార్‌ జైన్‌ వెల్లడించారు.  తమ తాజా  సెల్ఫీ ఫీచర్‌ ఫోన​ ‘జీ 24’ బ్యాటరీ  7గంటల టాక్‌ టైం,  300 గంటల స్టాండ్‌ బై అందిస్తుందని వివరించారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top