వచ్చే ఏడాది డివిడెండ్ వసూళ్ల లక్ష్యం రూ. లక్ష కోట్లు | Govt targets Rs1 trillion in dividend collection next fiscal | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది డివిడెండ్ వసూళ్ల లక్ష్యం రూ. లక్ష కోట్లు

Mar 2 2015 1:33 AM | Updated on Aug 20 2018 9:16 PM

వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ రంగ కంపెనీలు, బ్యాంకుల నుంచి రూ. లక్ష కోట్ల డివిడెండ్ వసూళ్లను లక్ష్యంగా నిర్దేశించుకుంది.

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ రంగ కంపెనీలు, బ్యాంకుల నుంచి రూ. లక్ష కోట్ల డివిడెండ్ వసూళ్లను లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇది ప్రస్తుత ఏడాది రూ.88,781 కోట్లతో పోలిస్తే దాదాపు 13% ఎక్కువ. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కనీసం 20% డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించాలి. లేకపోతే పన్ను చెల్లింపుల తర్వాత లాభాల్లో 20% ప్రభుత్వానికి ఇవ్వాలి. రూ.1,00,651 కోట్ల డివిడెండ్ వసూళ్ల లక్ష్యంలో రూ.36,174 కోట్లను ప్రభుత్వ రంగ సంస్థల నుంచి, రూ.64,477 కోట్లను బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థల నుంచి ప్రభుత్వం సేకరించనుంది. కేంద్ర ప్రభుత్వ పన్నేతర రాబడులలో డివిడెంట్ ఆదాయానిదే అగ్రభాగం.

Advertisement
 
Advertisement
Advertisement