ఫోర్డ్‌ ఎండీవర్‌ 2020 ఎడిషన్‌ | Ford India Launch Endeavour 2020 Edition | Sakshi
Sakshi News home page

ఫోర్డ్‌ ఎండీవర్‌ 2020 ఎడిషన్‌

Feb 26 2020 8:10 AM | Updated on Feb 26 2020 8:10 AM

Ford India Launch Endeavour 2020 Edition - Sakshi

న్యూఢిల్లీ: ఫోర్డ్‌ ఇండియా కంపెనీ ప్రీమియమ్‌ ఎస్‌యూవీ మోడల్, ఎండీవర్‌లో 2020 ఎడిషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఎండీవర్‌ ఎస్‌యూవీ 2020 ఎడిషన్‌ పరిచయ ధరలు రూ.29.55 లక్షలు (ఎక్స్‌ షోరూమ్, ఢిల్లీ) నుంచి ఆరంభమవుతాయని ఫోర్డ్‌ ఇండియా ప్రెసిడెంట్, ఎమ్‌డీ అనురాగ్‌ మెహరోత్రా చెప్పారు. ఈ ధరలు ఈ ఏడాది ఏప్రిల్‌ 30 వరకే అని, ఆ తర్వాత నుంచి రూ.70,000 అధికంగా ఉంటాయని వివరించారు.  బీఎస్‌–సిక్స్‌ ప్రమాణాలకు అనుగుణంగా 2.0 లీటర్‌ ఈకోబ్లూ ఇంజిన్‌తో ఈ ఎస్‌యూవీని రూపొందించామని, 10 గేర్ల ఆటోమేటిక్‌ ట్రాన్సిమిషన్‌ ప్రత్యేక ఆకర్షణ అని వివరించారు. 

14 శాతం అధిక మైలేజీ....
ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇంధన సామర్థ్యం అధికంగా ఉన్న ఎస్‌యూవీ ఎండీవరే అని అనురాగ్‌ పేర్కొన్నారు. ఈ 2020 ఎడిషన్‌ 14 శాతం అధిక మైలేజీని ఇస్తుందని తెలిపారు. ఈ మోడల్‌లో 4 ్ఠ2 డ్రైవ్‌లైన్‌ వేరియంట్‌ 13.9 కి.మీ. 4 ్ఠ4 డ్రైవ్‌లైన్‌ వేరియంట్‌ 12.4 కి.మీ. మైలేజీని ఇస్తాయని పేర్కొన్నారు. ఎస్‌యూవీలను కొనుగోలు చేయాలనుకునే కొత్త వినియోగదారులు ఎండీవర్‌నే ఎంచుకుంటారన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement