వంద రోజుల్లో 5జీ ట‍్రయల్స్‌ | DoT to begin 5G trials in 100 days Ravi Shankar Prasad | Sakshi
Sakshi News home page

వంద రోజుల్లో 5జీ ట‍్రయల్స్‌

Jun 3 2019 3:36 PM | Updated on Jun 3 2019 3:37 PM

DoT to begin 5G trials in 100 days Ravi Shankar Prasad  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  కొత్త టెలికాం శాఖ మంత్రిగా సోమవారం బాధ్యతలను స్వీకరించి రవి శంకర్ ప్రసాద్ దూకుడు పెంచారు. మరో వంద రోజుల్లో 5 జీ ట్రయల్స్‌ను ప్రారంభిస్తామని ప్రకటించారు. అలాగే హువావే 5 జీ ట్రయల్స్‌లో పాల్గొనే అంశాన్ని సీరియస్‌గా ఆలోచిస్తామని చెప్పారు. భారతదేశంలో 5 జి ట్రయల్స్ ప్రారంభించడానికి 100 రోజుల గడువుని నిర్ణయించారు . ఈ క్యాలెండర్ సంవత్సరంలోనే 5 జీ ఆధారిత తదుపరి స్పెక్ట్రమ్ వేలం నిర్వహిస్తామని చెప్పారు.

ట్రయల్‌ మొదలైన తరువాత 5 జిలో పాల్గొనడం అనేది తప్పనిసరికాదు అని, భద్రతా సమస్యలతో సహా ఒక కంపెనీ పాల్గొంటుందా లేదా అనేది సంక్లిష్టమైందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ప్రాధాన్యత జాబితాలో ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్‌ కీలకంగా ఉంటుందన్నారు. ఎందుకంటే, ఈ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ ఉనికి సమంజసమని తాను భావిస్తున్నానన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత ప్రభుత్వంలో ఐటీ, న్యాయశాఖమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement