పరామర్శను రాజకీయం చేస్తారా? | ysrcp mlas criticise tdp dirty politics | Sakshi
Sakshi News home page

పరామర్శను రాజకీయం చేస్తారా?

Jul 23 2014 12:44 PM | Updated on Sep 2 2017 10:45 AM

చెన్నై భవన ప్రమాద భాదితులను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించడాన్ని టీడీపీ రాజకీయం చేయడం శోచనీయమని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అన్నారు.

విజయనగరం: చెన్నై భవన ప్రమాద భాదితులను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించడాన్ని టీడీపీ రాజకీయం చేయడం శోచనీయమని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సుజయకృష్ణరంగారావు, రాజన్నదొర, పుష్పశ్రీవాణి అన్నారు. క్షతగాత్రులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

సుశీల అనే బాధితురాలికి కేజీహెచ్‌లో వైద్యం నిరాకరించారని తెలిపారు. పార్టీ తరపును బాధితురాలికి వైద్యసాయం అందిస్తామని చెప్పారు. చెన్నై భవన ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురు కుటుంబాలకు ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా ఆర్థికసాయం అందించారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement