'జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం' | Sakshi
Sakshi News home page

'జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం'

Published Sat, Nov 1 2014 9:49 AM

YSRCP MLA alla ramakrishna reddy boycotts Janmabhoomi progremme in mangalagiri madal

గుంటూరు :  మంగళగిరి మండలంలో శనివారం నుంచి జరిగే జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల భూములను ప్రభుత్వం భూ సర్వే చేయడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన శనివారమిక్కడ తెలిపారు. కాగా  నేటి  నుంచి ఆంధ్రప్రదేశ్లో 'జన్మభూమి-మా ఊరు' మలిదశ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే.

కాగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈరోజు ఉదయం మంగళగిరిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Advertisement
Advertisement