వీధి రౌడీలా చంద్రబాబు విమర్శలు | ysrcp leader vasireddy padma slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

వీధి రౌడీలా చంద్రబాబు విమర్శలు

Aug 24 2017 2:32 AM | Updated on Oct 19 2018 8:10 PM

వీధి రౌడీలా చంద్రబాబు విమర్శలు - Sakshi

వీధి రౌడీలా చంద్రబాబు విమర్శలు

నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ నేపథ్యంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రే నియామవళిని ఉల్లంఘించడం దారుణమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు.

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజం
►ఆ ఎమ‍్మెల్యేలు నంద్యాలలో ఎందుకు తిరుగుతున్నారు?
►ఓటర్లు మరింత భారీగా పోలింగ్‌లో పాల్గొనాలి
►వైఎస్‌ఆర్‌ సీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు
ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు

సాక్షి, హైదరాబాద్‌: ఓటర్లను ప్రభావితం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీధి రౌడీలా వ్యవహరించారని, తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అవాకులు చవాకులు పేలారని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో ఉప ఎన్నికలో అధికార పార్టీ ఎన్నికల కోడ్‌ను పూర్తిగా ఉల్లంఘించిందని, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ఎమ్మెల్యేలను నంద్యాలకు పంపించి ‘ఏం చేయగలుగుతారో.. చేయండి’ అంటూ ఆదేశాలు ఇచ్చారని మండిపడ్డారు.

వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ బుధవారం విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించడం దారుణమన్నారు. పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు నంద్యాలలో బాహటంగా తిరిగినా పట్టించుకోని పోలీసులు, నంద్యాల నివాసి శిల్పా చక్రపాణిరెడ్డిని ఓటర్‌ కాదంటూ పంపించివేశారని ఆమె ధ్వజమెత్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement