నావికుల మృతికి విజయమ్మ సంతాపం | YS Vijayamma Condolence death of sailors in INS Sindhurakshak blast | Sakshi
Sakshi News home page

నావికుల మృతికి విజయమ్మ సంతాపం

Aug 16 2013 9:57 PM | Updated on Sep 1 2017 9:52 PM

నావికుల మృతికి విజయమ్మ సంతాపం

నావికుల మృతికి విజయమ్మ సంతాపం

సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదంలో భారత నావికా దళానికి చెందిన 18 మంది సిబ్బంది మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తీవ్ర ఆవేదనను, సంతాపాన్ని వ్యక్తం చేశారు.

సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదంలో భారత నావికా దళానికి చెందిన 18 మంది సిబ్బంది మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తీవ్ర ఆవేదనను, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేకించి ఈ దుర్ఘటనలో అసువులు బాసిన విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు యువ నావికుల తూతిక రాజేష్, దాసరి దుర్గాప్రసాద్ కుటుంబాలకు ఆమె తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

భారత నావికా దళంలో నావికులుగా పనిచేస్తూ దేశ సేవలో నిమగ్నమైవున్న ఈ యువకుల మృతితో వారి కుటుంబాలకే కాకుండా దేశానికి కూడా తీరని నష్టమని శుక్రవారం విడుదల చేసిన సంతాప సందేశంలో విజయమ్మ పేర్కొన్నారు. ఈ పెను విషాదాన్ని ఎదుర్కొవడానికి వారి కుటుంబాలకు తగినంత ఆత్మస్థైర్యం కలిగించాలంటూ ఆమె భగవంతుడిని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement