ప్రజాసంకల్పయాత్ర 17వ రోజు షెడ్యూల్‌ | YS Jagan's Praja Sankalpa Yatra Day 17 Schedule | Sakshi
Sakshi News home page

వెల్దుర్తి నుంచి 17వ రోజు ప్రజాసంకల్పయాత్ర

Nov 24 2017 2:18 PM | Updated on Jul 25 2018 4:53 PM

YS Jagan's Praja Sankalpa Yatra Day 17 Schedule - Sakshi - Sakshi - Sakshi

వైఎస్‌ జగన్‌ ఫైల్‌ ఫోటో

సాక్షి, వెల్దుర్తి : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 17వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి నుంచి ఆయన శనివారం ఉదయం పాదయాత్రను ప్రారంభించనున్నారు.

రేపు ఉదయం 8 గంటలకు వెల్దుర్తి, చెరుకులపాడు, పుట్లూరు క్రాస్‌, తొగరచేడు క్రాస్‌ వద్దకు చేరుకుంటారు.  ఈ యాత్రలో వైఎస్‌ జగన్‌ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు.

భోజన విరామం అనంతరం కృష్ణగిరి నుంచి పాదయాత్ర పున:ప్రారంభం అవుతుంది. అలాగే సాయంత్రం 6.30గంటలకు రామకృష్ణ పురం చేరుకుంటారు.  అనంతరం రాత్రి 7.30 గంటలకు వైఎస్‌ జగన్‌ బస చేస్తారు. ఈమేరకు 17రోజు పర్యటన వివరాలను వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement