ఉపాధ్యాయులకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

YS Jagan wishes to teachers - Sakshi

సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు నిర్వహించే పాత్ర అత్యంత స్ఫూర్తి దాయకమైనదని, ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తాను ప్రతి ఒక్క గురువుకు నమస్కరిస్తున్నానని వైఎస్‌ జగన్‌ తన సందేశంలో పేర్కొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు ఆయన నివాళులర్పించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top