26, 27న తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన | ys jagan to visit helen affected areas | Sakshi
Sakshi News home page

26, 27న తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన

Nov 24 2013 1:54 AM | Updated on Sep 4 2018 5:07 PM

హెలెన్’ బీభత్సంతో కోస్తా జిల్లాలు అతలాకుతలమైన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 26, 27 తేదీల్లో పర్యటించనున్నారు.

సాక్షి, హైదరాబాద్: ‘హెలెన్’ బీభత్సంతో కోస్తా జిల్లాలు అతలాకుతలమైన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 26, 27 తేదీల్లో పర్యటించనున్నారు. వరుస విపత్తులు రైతును నట్టేట ముంచిన నేపథ్యంలో బాధితులను పరామర్శించి వారికి భరోసా కల్పించాలని ఆయన నిర్ణయించారు. దీంతో ఈ నెల 28 నుంచి ఆయన చిత్తూరు జిల్లా కుప్పం నుంచి చేపట్టాల్సిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర ప్రారంభ తేదీ మారింది. ఈ నెల 30వ తేదీ నుంచి యాత్రను ప్రారంభించాలని నిర్ణయించినట్టు పార్టీ ఒక ప్రకటనలో తెలియజేసింది. జగన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత 30వ తేదీ నుంచి సమైక్య శంఖారావాన్ని చేపడతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement