రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | woman died in road accident at ysr district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Jan 13 2016 6:00 PM | Updated on Aug 30 2018 3:58 PM

వైఎస్సార్ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది.

రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లె వద్ద బైక్పై వెళ్తున్న వారిని ఓ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


గ్రామానికి చెందిన డి.రోజా(34) తన అక్క కుమారుడితో కలసి బైక్‌పై వెళ్తుండగా స్థానిక మార్కెట్ యార్డు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో రోజా అక్కడికక్కడే చనిపోగా ఆమె బంధువు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement