హెచ్పీసీఎల్ పేలుడు దుర్ఘటనలో మృతుల సంఖ్య 23కు పెరిగింది. ప్రమాదంలో గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో మరో నలుగురు ఈరోజు మృతి చెందారు.
హెచ్పీసీఎల్ పేలుడు దుర్ఘటనలో మృతుల సంఖ్య 23కు పెరిగింది. ప్రమాదంలో గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో మరో నలుగురు ఈరోజు మృతి చెందారు. ఆగస్టు 23న విశాఖ హెచ్పీసీఎల్ పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. కూలింగ్ టవర్లోకి గ్యాస్ లీకేజీ వల్లే భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్టు హెచ్పీసీఎల్ ఉన్నతాధికారులు తర్వాత వెల్లడించారు.
కూలింగ్ టవర్కు వెళ్లే పైపుల్లోకి గ్యాస్ (హైడ్రో కార్బన్, మీథేన్, ఈథేన్, ప్రొఫేన్) లీకేజీ కావడంతో పేలుడు సంభవించినట్టు ప్రాథమిక నిర్ధారణకొచ్చినట్లు చెప్పారు. గ్యాస్ భారీ స్థాయిలో రావడంతో అలారం పనిచేయలేదన్నారు. దీనిపై విచారణ జరపనున్నట్టు తెలిపారు. 2009లో నిర్మించిన రెండో కూలింగ్ టవర్ను యూరో-4 నాణ్యతాప్రమాణాల మేరకు ఆధునీకరిస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందన్నారు. దుర్ఘటన సమయంలో కూలింగ్ టవర్ వద్ద సుమారు వంద మంది పనిచేస్తున్నారని చెప్పారు.
పనులు పూర్తయిన టవర్లో నిర్వహించిన హైడ్రాలిక్ టెస్ట్, వెల్డింగ్ పనులే కొంప ముంచాయని వారు చెబుతున్నారు. హైడ్రాలిక్ టెస్ట్ సమయంలో ఒత్తిడి పెరిగిపోయి మంటలు చెలరేగాయి. అదే సమయంలో టవర్పైన వెల్డింగ్ పనులు కూడా ప్రమాదానికి దోహదం చేశాయి.