ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు | vigilence attacks on fertilizer shops | Sakshi
Sakshi News home page

ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు

Feb 5 2015 7:16 PM | Updated on Oct 1 2018 6:38 PM

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు గురువారం సాయంత్రం దాడులు నిర్వహించారు.

రాయదుర్గం: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు గురువారం సాయంత్రం దాడులు నిర్వహించారు. రాఘవేంద్ర ఫెర్టిలైజర్స్, మారుతి ఫెర్టిలైజర్స్ అనే రెండు షాపుల్లో అనుమతుల్లేకుండా రసాయనిక ఎరువులు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించారు. ఈ దాడుల్లో సీఐ రాఘవన్, మండల వ్యవసాయ అధికారి ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. వెంటనే రసాయనిక ఎరువుల విక్రయాలను నిలిపివేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement