ఎమ్మార్వోను సస్పెండ్ చేయాలంటూ ధర్నా | Victims demanding for mro suspension in krishna district over corruption | Sakshi
Sakshi News home page

ఎమ్మార్వోను సస్పెండ్ చేయాలంటూ ధర్నా

Jun 25 2016 1:49 PM | Updated on Sep 22 2018 8:22 PM

ఎమ్మార్వోను సస్పెండ్ చేయాలంటూ ధర్నా - Sakshi

ఎమ్మార్వోను సస్పెండ్ చేయాలంటూ ధర్నా

అవినీతికి పాల్పడిన తహశీల్దార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. బాధిత మహిళలు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది.

కృష్ణాజిల్లా: అవినీతికి పాల్పడిన తహశీల్దార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. బాధిత మహిళలు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది.

కంచికచర్ల తహశీల్దార్‌గా పని చేస్తున్న ఎన్. విజయ్‌కుమార్ గ్రామానికి చెందిన మందా శామ్యేల్‌కు చెందిన ఆరు ఎకరాల భూమిని లంచం తీసుకొని వేరే వారి పేరు మీద పట్టాదారు పాసుపుస్తకాన్ని సృష్టించాడు. విషయం తెలుసుకున్న బాధితులు శనివారం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తహశీల్దార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని లేకుంటే.. ఇక్కడి నుంచి కదిలేది లేదని మహిళలు ధర్నా చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement